పేదలకు ఇస్తున్న జగనన్న ఇళ్లులా? లేక వైసీపీ భూ అక్రమార్కుల వ్యాపార స్థలాలా?

బొబ్బిలి, రామభద్రపురం మండలంలో పేద ప్రజలకు ఇస్తున్నటువంటి జగనన్న ఇళ్లు నిర్మాణాలు చేపడుతున్న స్థలాలను జనసేన పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి బాబు పాలూరు, జిల్లా కార్యనిర్వహణ కార్యదర్శి మహంతి ధనుంజయ, తెర్లాం మండల అధ్యక్షులు మరడాన రవి, వీర మహిళలు బంటుపల్లి దివ్య, రమ్య జనసేన నాయకులు చీమల సతీష్, పెద్దపల్లి భాష, వెంకటేష్, రాము, సాయి, కార్యకర్తలు పరిశీలించారు. ఈ సందర్భంగా బాబు పాలూరు మాట్లాడుతూ పేదలకు కాకుండా పెత్తందారులకు మాత్రమే ఇక్కడ స్థలాలు ఉన్నాయని ఒక్కొక్కరికి ఇచ్చే స్థలాల్లో కాకుండా భారీ ఎత్తున నిర్మాణాలు చేపడుతున్నారని ఇవి ఎవరి ఆధ్వర్యంలో జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు మాత్రమే ఉండవలసిన ఇళ్ళు రెండేసి ఫ్లాట్లు కలిపి నిర్మాణం చేస్తుండగా, స్థానిక వైసీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ అధికారులకు కనపడకపోవడం విడ్డూరంగా ఉందని అన్నారు. ఇప్పటివరకు ఎన్నో ఫ్లాట్లకు అధికారులు అనుమతి ఇచ్చారు ఎంతమందికి పూర్తిస్థాయిలో నిర్మాణం చేపట్టారు ఈ యొక్క వెంచర్లో ఎంతమందికి నిజమైన లబ్ధిదారులు ఉన్నారో పూర్తి సమాచారం ప్రజలకు తెలియజేసిన అవసరం స్థానిక ఎమ్మార్వోకి ఉందని, అలాగే నిజమైన లబ్ధిదారుల యొక్క లిస్టును బయటికి తీస్తుందని హెచ్చరించారు. ఈ యొక్క ఈ భారీ స్కాంలో ఎవరున్నా కూడా ఉపేక్షించేది లేదన్నారు. అక్రమాలకు పాల్పడినటువంటి ప్రతి ఒక్కరిని బయటకు రప్పిస్తామని మీడియాకు తెలిపారు.