జగనన్న కాలనీలలో రాయచోటి జనసేన డిజిటల్ క్యాంపెయిన్

రాయచోటి నియోజకవర్గం: జనసేనపార్టీ సీనియర్ నాయకులు రామ శ్రీనివాస్ గారు మాట్లాడుతూ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ప్రవేశపెట్టిన జగనన్న కాలనీలో చాలీచాలకుండా ఇచ్చిన ప్రభుత్వ జాగాలను హామీ మరిచి ప్రజలపైకే భారం వేసిన వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఇల్లు కట్టిస్తాము అని చెప్పిన ప్రభుత్వం మాట మరచి 1,80,000కు స్కీంపెట్టారు. విడతలవారీగా ఇచ్చే బిల్లులు అరకొరా చాలీచాలని బిల్లులు కూడా కోత విధించిన జగన్ ప్రభుత్వం వెంటనే ప్రభుత్వం దీనిపై చర్యలు తీసుకొని లబ్ధిదారులకు న్యాయం చేయాలని శనివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ డిమాండ్ చేస్తుంది. జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు జగనన్న కాలనీలపై క్యాంపింగ్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాయచోటి నియోజకవర్గం అసెంబ్లీ ఇన్చార్జ్ హసన్ భాష, అన్నమయ్య జిల్లా జనసేన పార్టీ సీనియర్ నాయకులు రామ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.