కొమరగిరి జగనన్న కాలనీల వద్ద తంగెళ్ళ శ్రీనివాసు ఆధ్వర్యంలో ధర్నా
పిఠాపురం నియోజవర్గం: ఉప్పాడ కొత్తపల్లి మండలం కొమరగిరి గ్రామం నందు గల జగనన్న ఇళ్ళ స్థలాలు కాలనీలను ఆదివారం ఉదయం పిఠాపురం నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ సందర్శించారు. జగనన్న ఇళ్ళ స్థలాలను నీటిలో మునిగిపోయే స్థలాలను కేటాయించడం జరిగిందని దీని కారణంగా జగనన్న ఇళ్ళ స్థలాలు లబ్ధిదారులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని తీరా ఇంటిని నిర్మించుకున్న తర్వాత వర్షపునీరు కారణంగా ఇల్లు మునిగిపోయే దుస్థితి ఏర్పడుతుందని, కాబట్టి తక్షణం జగనన్న ఇళ్ల స్థలాలు కేటాయించిన చోట రోడ్లను నిర్మించి ఎత్తు చేయవలసిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేననాయకులు జ్యోతుల శ్రీనివాసు, తోలేటి శిరీష, పిల్లా శ్రీధర్, వెన్న జగదీష్, వెన్నపు చక్రరావు, అమరాధి వల్లి, అడబాల సురేష్, కంబాల దాసు, పల్లెటి బాప్పన్న దోర, కట్టా శివ జనసైనికులు జనసేన నాయకులు జనసేన కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-30-at-4.02.48-PM-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-30-at-4.02.52-PM-1024x576.jpeg)