జగనన్న కాలనీని సందర్శించిన యడ్లపల్లి రామ్ సుధీర్
- పెడన పట్టణ శివారు పల్లోటి స్కూల్ సమీపంలో ఉన్న జగనన్న కాలనీని అరెస్టుకు ముందు సందర్శించిన పెడన జనసేన నాయకులు యడ్లపల్లి రామ్ సుధీర్
పెడన నియోజకవర్గం: జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు వర్షంలో మునిగిన జగనన్న కాలనీల సందర్శనలో భాగంగా శనివారం పెడన నియోజకవర్గంలో జనసేన నాయకులు యడ్లపల్లి రామ్ సుధీర్ పెడన పట్టణ శివారు పల్లోటి స్కూల్ సమీపంలో ఉన్న జగనన్న కాలనీలో #FailureOfJanagannaColony కార్యక్రమం నిర్వహించి. కాలనీ దుస్థితిని తెలియచేసిన పెడన నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు యడ్లపల్లి రామ్ సుధీర్. అనంతరం పెడన పట్టణంలోని పైడమ్మ లే అవుట్ దగ్గర ఉన్న జగనన్న కాలనీకి బయలుదేరి వెళుతుండగా పోలీసులు అరెస్టు చేయడంతో #FailureOfJanagannaColony కార్యక్రమం కొనసాగించలేక పోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొని పెడన నుంచి రామ్ సుధీర్ వెనకాలే కార్లు, బైకులతో ఉంగుటూరు పోలీస్ స్టేషన్ వరకూ వచ్చి విడుదల అయ్యే వరకు రామ్ సుధీర్ తోనే ఉన్న పెడన నియోజకవర్గం నాయకులకు, జనసైనికులకు పేరు పేరునా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు.. అలాగె వెంటనే స్పందించి ఉంగుటూరు పోలీస్ స్టేషన్ కు వచ్చిన గుడివాడ నియోజకవర్గం జనసేన నాయకులు సందు పవన్, పామర్రు జనసేన ఇంఛార్జి తాడిసెట్టి నరేష్, నూజివీడు నియోజకవర్గం జనసేన నాయకులు భర్మ ఫణి లకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-30-at-5.46.13-PM-1024x462.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-30-at-5.46.14-PM-1024x462.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-30-at-5.46.15-PM-1024x462.jpeg)