చిన్నఓరంపాడు ఘటనలోని భాదితులను పరామర్శించిన రామ శ్రీనివాస్

రాజంపేట నియోజకవర్గం: రాజంపేట గ్రామీణ పరిధిలో ఉటుకూరు పంచాయితీలోని బవనగిరిపల్లికి చెందిన ఏనుగుల మల్లికార్జున మరియు వారి తండ్రి ఏనుగుల శంకరయ్యలను సోమవారం జనసేన పార్టీ నాయకులు రామ శ్రీనివాస్ పరామర్శించారు. ఇటీవల కాలంలో చిన్నఓరంపాడు సమీపంలో తిరుపతి నుంచి కడప వైపు వెళ్తున్న ఎక్స్ ప్రెస్ బస్సు ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఆ ఘటనలో ఏనుగుల మల్లికార్జున మరియు అతని తండ్రి శంకరయ్యలకు తీవ్ర గాయాలయ్యాయి. వారు తిరుపతి అమర్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న అనంతరం ఇంటికి చేరుకోగా వారి స్వగ్రామమైన బవనగిరిపల్లిలో వారి ఇరువురి ఇంటికి వెళ్ళి వారి ఆరోగ్య పరిస్థితులు గురించి తెలుసుకుని జనసేన పార్టీ తరపున మనోధైర్యం కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నేత రామ శ్రీనివాస్, యువనాయకుడు అబ్బిగారి గోపాల్, శివ, రవి, శ్రీను, మురళి మోహన్ తదితరులు పాల్గొన్నారు.