చందానగర్ అండర్ పాస్ బ్రిడ్జి ను సందర్శించిన జనసేన నాయకులు

శేరిలింగంపల్లి నియోజకవర్గం: చందానగర్ అండర్ పాస్ వద్ద డ్రైనేజీ వ్యవస్థను రిపేర్ చేయించే విషయంలో ప్రభుత్వం మొద్దు నిద్రను వీడాలని జనసేన శేరిలింగం పల్లి ఇంఛార్జి డా. మాధవరెడ్డి కోరారు. జనసేన శేరిలింగం పల్లి, నియోజవర్గ ఇంచార్ట్ డా. మాధవ రెడ్డి ఆధ్యర్యంలో మంగళవారం చందానగర్ అండర్ పాస్ బ్రిడ్జీ సందర్శించటం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కలకుంట్ల తారకరామా రావు గారు ప్రొద్దున లేస్తే హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దామని ప్రగల్భాలు పలికే ప్రభుత్వ పెద్దలు వాస్తవానికి సామాన్యులు, బీద, బడుగు బలహీన వర్గాల జీవన విధానాల్లో మెరుగు పడటం కోసం అయితే ఎటువంటి కృషి చేయడం లేదు. మన శేరిలింగం పల్లి నియోజక వర్గం నుండి అయితే పన్నుల రూపంలో రాష్ట్రంలో అధిక ఆదాయం మన నియోజకవర్గం నుండి చెల్లిస్తున్నాం, కాని శేరిలింగం పల్లి అభివృద్ధికి కేటాయించాల్సిన నిధులు అయితే కేటాయించటం లేదు. చందానగర్ అండర్ పాస్ ల ద్వారా రోజుకు వేలాది మంది ప్రయాణిస్తున్నారు. అయితే వర్షాలు వచ్చినప్పుడల్లా రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతున్నది. ఇదే విషయాన్ని వినతి పత్రాల ద్వారా ఇప్పటికే 4, 5 సార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకు పోయినప్పటికీ, అధికార యంత్రాంగం మొద్దు నిద్ర వీడటం లేదు, ఎన్నికల సమయాల్లో కాకుండా ఇటువంటి సమయాల్లో శేరిలింగం పల్లి ఎమ్మెల్యే గారు నియోజకవర్గం అంతా తిరిగితే ప్రజలు సమస్యలు తెలుస్తాయని హితవు పలికారు. వెంటనే చందానగర్ అండర్ పాస్ ల డ్రైనేజ్ వ్యవస్థను రిపేర్ చేయించి, శాశ్వత పరిష్కారం కొరకు ఆలోచనలు చేయాలని, ఈ సమస్యకు పరిష్కారాలను చూపాలని డిమాండ్ చేసారు. లేని యెడల రానున్న రోజుల్లో జనసేన పార్టీ ఆధ్యర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలను నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మల్లేష్ ముదిరాజ్, హనుమంత్ నాయక్, గాంధీ, ఎస్.డి సాజిద్, రఘు మరియు జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.