కామరాజుపేట గ్రామంలో జనం కోసం జనసేన

  • జనం కోసం జనసేన 601వ రోజు

జగ్గంపేట నియోజకవర్గం: జనసేన నాయకులు పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర జగ్గంపేట నియోజకవర్గంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జనం కోసం జనసేన 601వ రోజులో భాగంగా జనసేన ఎన్నికల గుర్తు గాజు గ్లాసుల పంపిణీ కార్యక్రమం మంగళవారం గోకవరం మండలం, కామరాజుపేట గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా 600 గాజు గ్లాసులు పంచడం జరిగింది. నేటి వరకు నియోజకవర్గం మొత్తంగా 101360 గాజు గ్లాసులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గోకవరం మండల మహిళా కమిటీ అధ్యక్షురాలు చల్లా రాజ్యలక్ష్మి, జగ్గంపేట మండల అధ్యక్షులు మరిశే రామకృష్ణ, జగ్గంపేట మండల బిసి సెల్ అధ్యక్షులు రేచిపూడి వీరబాబు, కిర్లంపూడి మండల కార్యదర్శి ఎరుబండి పెద్దకాపు, కామరాజుపేట నుండి కరణం సూరిబాబు, జాజుల అశోక్, వెలిశెట్టి దుర్గాప్రసాద్, కొత్తపల్లి నుండి సోలా అంజిబాబు, చేదులూరి సతీష్, కొప్పన సూరి, వనుం ప్రదీప్, మాదారపు విక్రం సాయి, జె.కొత్తూరు నుండి గ్రామ అధ్యక్షులు గుంటముక్కల మధు, గోనేడ నుండి నల్లంసెట్టి చిట్టిబాబు, వల్లపుశెట్టి నానిలకు పాటంశెట్టి శ్రీదేవి కృతజ్ఞతలుతెలిపారు.