గంగవరం పోర్టు నిర్వాసిత కార్మికులకు జనసేన అండగా ఉంటుంది: నాదెండ్ల
గాజువాక నియోజకవర్గం: 64వ వార్డ్ కార్పొరేటర్, జనసేన పార్టీ జివిఎంసి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ దల్లి గోవింద రెడ్డి ఆధ్వర్యంలో గురువారం గంగవరం పోర్ట్ నిర్వాసిత కార్మికులు జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ను కలిసి గంగవరం అదాని పోర్ట్ నిర్వాసిత కార్మికుల సమస్యను వివరించి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. విశాఖపట్నం పర్యటనలో భాగంగా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు గంగవరం పోర్ట్ నిర్వాసిత కార్మికులను కలిసి సమస్యపై మాట్లాడుతారని అలాగే గంగవరం అదాని పోర్టు నిర్వాసిత కార్మికులకు జనసేన పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ గాజువాక నియోజకవర్గ ఇన్చార్జ్ కోన తాతారావు, మత్స్యకార వికాష విభాగ ప్రధాన కార్యదర్శి జనసేన పార్టీ దక్షిణ నియోజకవర్గం ముఖ్య నాయకులు డాక్టర్ మూగి శ్రీనివాసరావు, మరియు గంగవరం పోర్ట్ నిర్వాసిత మత్స్యకార కార్మికులు పాల్గొనడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/08/WhatsApp-Image-2023-08-03-at-8.27.00-PM-1024x461.jpeg)