నరసాపురం గ్రామంలో పలు కుటుంబాలను పరామర్శించిన శ్రీమతి బత్తుల
రాజానగరం నియోజకవర్గం: కోరుకొండ మండలం, నరసాపురం గ్రామంలో పలు కుటుంబాలను శుక్రవారం జనసేన నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి పలకరించి పరామర్శించారు. ప్రగడ పోసియ్య ఇటీవల యాక్సిడెంట్ లో గాయాలు పాలై బాధపడుతున్న విషయం తెలుసుకున్న శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి వారిని పలకరించి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. అనంతరం అడ్డాల కమల ఇటీవల స్వర్గస్తులయ్యారని తెలుసుకుని వారి కుటుంబసభ్యులను పరామర్శించి మనోదైర్యం చెప్పారు. అనంతరం బత్తుల బుజ్జియ్య ఇటీవల స్వర్గస్తులయ్యారు. విషయం తెలుసుకుని వారి కుటుంబసభ్యులను పరామర్శించి మనోదైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు మట్ట నాగేశ్వరావు, చొంగ తేజ, భోజ వీరబాబు, అడ్డాల దుర్గ, అడ్డాల భద్రయ్య, ప్రగడ దేవి, దాకవరపు వెంకటేషులు, చదువు శ్రీను, మరియు జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/08/WhatsApp-Image-2023-08-04-at-3.41.30-PM-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/08/WhatsApp-Image-2023-08-04-at-3.41.30-PM-1-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/08/WhatsApp-Image-2023-08-04-at-3.41.31-PM-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/08/WhatsApp-Image-2023-08-04-at-3.41.31-PM-2-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/08/WhatsApp-Image-2023-08-04-at-3.41.32-PM-1024x768.jpeg)