మృతురాలి కుటుంబానికి డాక్టర్ కందుల చేయూత

  • విజయవంతంగా సాగుతున్న పవనన్న ప్రజా బాట
  • 82వ రోజుకు చేరిన పవన్ అన్న ప్రజా బాట
  • డాక్టర్ కందులకు ప్రజల నీరాజనం

విశాఖ దక్షిణ నియోజకవర్గం: విశాఖ దక్షిణలో పవనన్న ప్రజా బాట కార్యక్రమం నియోజకవర్గ జనసేన నాయకులు, 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు ఆధ్వర్యంలో విజయవంతంగా కొనసాగుతుంది. శనివారం నాటికి ఈ కార్యక్రమం 82వ రోజుకు చేరుకుంది. కార్యక్రమంలో భాగంగా చలవతోటలో మృతి చెందిన వరలక్ష్మి కుటుంబానికి ఆర్థిక సహాయం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ
పవనన్న ప్రజా బాట కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తుందన్నారు. వెళ్లిన ప్రతిచోట ప్రజలు బ్రహ్మ రథం పడుతున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగంగా నేరుగా ప్రజల నుంచి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నట్లు తెలిపారు. సాధ్యమైన మేర ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రజల మంచి కోసం తాను ఏమి చేయడానికి అయినా సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కిషోర్, జానకి, వాణి నాని, తేజ, ఉమా శంకర్, గణేష్, దక్షిణ నియోజకవర్గ యువ నాయకుడు కేదార్నాథ్, 32వ వార్డు ఇంచార్జ్, దక్షిణ నియోజకవర్గం యువ నాయకుడు కందుల బద్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.