జనసేనాని మల్లవల్లి పర్యటనను విజయవంతం చేయండి: ఫణి బాబు

నూజివీడు: మలవల్లి రైతులకు మద్దతు తెలపడానికి వస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటనను విజయవంతం చేయాలని నూజివీడు నియోజకవర్గ జనసేన నాయకులు బర్మా ఫణి బాబు పిలుపునిచ్చారు. నూజివీడు మండలం, గొల్లపల్లి, మీర్జాపురం, మర్రి బంధం, పల్లెర్ల మూడి గ్రామాలకు చెందిన రైతులకు మద్దతుగా నూజివీడు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బర్మా ఫణి బాబు రైతులతో కలసి మల్లవల్లిలో ఆదివారం జరగనున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పర్యటనకు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ గన్నవరం నియోజకవర్గానికి చెందిన కొందరు రైతులకు మాత్రమే ఆనాడు పరిహారం చెల్లించగా మిగిలిన రైతులకు నాన్ లోకల్ నెపంతో పరిహారాన్ని ఎగ్గొట్టారని అన్నారు. ఈ నేపథ్యంలో 100 రోజులపాటు ఇండస్ట్రియల్ ఎస్టేట్ వద్ద వంటావార్పుతో రైతులు ఆందోళనకు దిగినా అధికారులు పట్టించుకోలేదని, అనంతర పరిణామాలతో రైతులపై అక్రమ కేసులు పెట్టారాన్నారు. ఏలూరులో ఏర్పాటు చేసిన జనవాణి కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ దృష్టికి మల్లవల్లి రైతుల దీనగాధను తెలియపరచడంతో
రైతు పోరాటానికి మద్దతుగా నిలుస్తానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ నేపథ్యంలో ఆగస్టు ఆరవ తేదీన ఆదివారం మల్లవల్లి ఇండస్ట్రియల్ వద్ద పవన్ రైతులతో ముఖాముఖి ఏర్పాటు చేశారు. 125 మంది రైతులలో సుమారు 75 మంది రైతులు నూజివీడు నియోజకవర్గానికి చెందినవారు గా గుర్తించామన్నారు. ఇప్పటికైనా గన్నవరం ఎమ్మెల్యే డాక్టర్ వల్లభనేని వంశీ మోహన్, నూజివీడు శాసనసభ్యులు మేక వెంకట ప్రతాప్ అప్పారావు లు అధికార వైసీపీకి చెందినవారు కావడంతో చొరవ చూపితే పరిష్కారం అవుతుంది. నేడు అందరి చూపు పవన్ పర్యటన పైనే ఉంది రైతులు జనసేన కార్యకర్తలు వీరమహిళలు పాల్గొని పవన్ పర్యటనను విజయవంతం చేయాలనీ కోరిన నూజివీడు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బర్మా ఫణి బాబు ఆయనతో పాటు నియోజకవర్గ నాయకులు తోట వెంకట్రావు, పాశం నాగబాబు, ఏనుగుల చక్రి, ముక్కు మహేష్, వలసపల్లి రామక్రిష్ణ, సువర్ణ బాబు, భరత్, సురేష్, బాధిత రైతులు పాల్గొన్నారు.