కడవకుదురు జనసేన కార్యాలయంలో క్రియాశీలక కిట్ల పంపిణి కార్యక్రమం

పర్చూరు నియోజకవర్గం: కడవకుదురు జనసేన పార్టీ కార్యాలయంలో చిన్నగంజాం మండల అధ్యక్షులు సందు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మకంగా తీసుకు వచ్చిన జనసేన సభ్యుల క్షేమం కోసం అమలులోనికి తీసుకువచ్చిన క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న జనసేన కార్యకర్తలకు ఎంతో ప్రేమతో పంపినటువంటి క్రియాశీలక సభ్యుల కిట్ల పంపిణీ కార్యక్రమం జరిగినది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన పార్టీ చేనేత వికాస విభాగ అధ్యక్షులు కర్ణ కిరణ్ తేజ, పర్చూరు నియోజకవర్గ యువనాయకులు తోట అశోక్, చక్రవర్తి పాల్గొన్నారు.