తహశీల్దార్ ను మర్యాదపూర్వకంగా కలసిన బొబ్బేపల్లి
సర్వేపల్లి నియోజకవర్గం: మనుబోలులో బుధవారం నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టిన తహసిల్దార్ ను సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా మనుబోలు మండలంలో కొన్ని సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. దాంతో వారు స్పందించి ఆ సమస్యల పరిష్కరించడానికి కృషి చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల నాయకులు ప్రసాద్, జాకీర్, పవన్, ఖాజా, సుబ్రమణ్యం, సుధాకర్, వెంకయ్య తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/08/WhatsApp-Image-2023-08-09-at-4.48.54-PM-1024x462.jpeg)