నీరు లేక ఎండిపోతున్న పంట పొలాలు

పెడన నియోజకవర్గం: జనసేన నాయకులు ఎస్ వి బాబు బుధవారం పెడన లోని పంట పొలాలను పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పెడన నియోజకవర్గంలో మొన్నటి వరకు చెరువులను తలపించిన పంట పొలాలు నేడు ఎడారిని తలపిస్తున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలతో నిండా మునిగిన రైతు తమ పంట పొలాల్లో నీరుని బయటకు తోడుకున్నారు. అదే రైతులు ప్రస్తుతం తమ పంట పొలాల్లోకి ఇంజిన్ లో నీళ్లు తోడుకోవడానికి పంట కాలవల్లో నీళ్లు లేని పరిస్థితి. వైసిపి ప్రభుత్వం అధికారం చేపట్టినాక కృష్ణ డెల్టా పరిస్థితి ప్రశ్నార్ధకంగా మారింది. అతివృష్టి అనావృష్టితో రైతు సతమతమవుతున్నాడు. భారీ వర్షాలకు పంటలు మునిగిపోవడానికి గాని, ప్రస్తుతం నీటి ఎద్దడికి గాని ముఖ్య కారణం స్థానిక ఎమ్మెల్యే మరియు మంత్రి అయినా జోగి రమేష్ అక్రమ మట్టి తవ్వకం మీద పెట్టిన శ్రద్ధ కాలవల తవ్వకంపై పెట్టకపోవడమే ప్రధాన కారణం. గత నాలుగు సంవత్సరాల నుండి పంట కాలువలో గాని మురుగు కాలువలో గాని తట్ట మట్టి తీసిన దాఖలాలు లేవు. తక్షణమే నీటిపారుదల అధికారులు స్పందించి పెడన నియోజకవర్గం విడుదల చేయవలసిందిగా జనసేన పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షాన రైతు పక్షాన నిలిచి ఇలాంటి ఉద్యమానికైనా సిద్ధం.