అరట్లకట్ట గ్రామంలో జనం కోసం పవన్ – పవన్ కోసం మనం 2వ రోజు
కాకినాడ రూరల్ నియోజకవర్గం: కరప మండలం, అరట్లకట్ట గ్రామంలో గ్రామ అధ్యక్షులు బత్తుల సతీష్ ఆధ్వర్యంలో రెండవ రోజు జనం కోసం పవన్ -పవన్ కోసం మనం కార్యక్రమం ద్వారా ఇంటింటికి పాదయాత్ర చేస్తూ సమస్యలు తెలుసుకుంటున్న జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ ఈ గ్రామంలో పర్యటన చేస్తున్న సమయంలో నానాజీకి ప్రజలు వారి సమస్యలను విన్నవించుకున్నారు.
ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న కాలనీలలో మంచినీటి కొరత మరియు రోడ్ల నిర్మాణం కూడా చేపట్టలేదు. గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదు. స్మశాన వాటికలో మౌలిక వసతులు లేవు. షెడ్ నిర్మాణం చేయవలసి ఉంది. బ్యాంకింగ్ కెనాల్ మీద ఉన్న బ్రిడ్జి నిర్మాణం పూర్తి కాక సుమారు 20 గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పాలవుతున్నారు. కాకినాడ ప్రజలకు ఈ గ్రామం నుండి వాటర్ సప్లై జరుగుతున్న కాని అరట్లకట్ల గ్రామంలో త్రాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. రోడ్లు సరిగా లేవు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన నాయకులు, కరప మండల నాయకులు, కాకినాడ రూరల్ మండల నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/08/WhatsApp-Image-2023-08-11-at-6.23.40-PM-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/08/WhatsApp-Image-2023-08-11-at-6.23.42-PM-1024x576.jpeg)