కీ.శే.పామర్తి ప్రసాద్ కుటుంబానికి జనసేన ఆర్థిక సహాయం
అవనిగడ్డ నియోజకవర్గం: మోపిదేవి మండలం, మెరకనపల్లి గ్రామంలో కీ.శే.పామర్తి ప్రసాద్ కుటుంబానికి జనసేన పార్టీ ఆధ్వర్యంలో లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించడం జరిగింది. వివరాలలోనికి వెళితే గత కొద్ది రోజుల క్రితం మెరకనపల్లి గ్రామంలో అనారోగ్య కారణంగా పామర్తి ప్రసాద్ మరణించడంతో ప్రసాద్ తల్లి తలకొరివి పెట్టిన విషయం అందరినీ కలచివేసింది. తదనంతరం మెరకనపల్లి జనసేన పార్టీ మరియు మోపిదేవి మండల జనసేన పార్టీ తరపున పామర్తి ప్రసాద్ తల్లికి మరియు కుటుంబ సభ్యులకు అండగా నిలవాలని జనసేన పార్టీ అవనిగడ్డ నియోజకవర్గ స్ధాయిలో లక్ష రూపాయలు నగదు రూపంలో విరాళాలు సేకరించడం జరిగింది. ఆ వచ్చిన మొత్తం నగదు శనివారం జనసేన పార్టీ మోపిదేవి మండల అధ్యక్షులు పూషడపు రత్న గోపాల్ అధ్యక్షతన మెరకనపల్లి గ్రామ జనసేన పార్టీ అధ్వర్యంలో కొడుకు చనిపోయి బాధలో ఉన్న తల్లికి 1,00,000/- రూపాయిలు మరియు అదే గ్రామంలో ఆటో ఏక్సిడెంట్ లో గాయపడిన వ్యక్తికి 10,000/- రూపాయిలు ఉమ్మడి కృష్ణా జిల్లా అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ చేతులు మీదగా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు మత్తి వెంకటేశ్వరరావు, కృష్ణా జిల్లా అధికార ప్రతినిధి రాయపూడి వేణుగోపాల్, ఉమ్మడి కృష్ణా జిల్లా కార్యదర్శి ఉస్మాన్ షరీఫ్, అవనిగడ్డ మండల అధ్యక్షులు గుడివాక శేషుబాబు, చల్లపల్లి మండల అధ్యక్షులు చోడగం విమల్ కృష్ణ, అవనిగడ్డ టౌన్ అధ్యక్షులు రాజనాల వీరబాబు, మోపిదేవి మండల ఉపాధ్యక్షులు మెరకనపల్లి నరేష్, భోగిరెడ్డి సాంబయ్య, మండల ప్రధాన కార్యదర్శి ఆకుల పవన్ కళ్యాణ్, బాధర్ల లోలాక్ష నాయుడు, సిద్దినేని అశోక్ నాయుడు, మెరకనపల్లి గ్రామ జనసేన పార్టీ అధ్యక్షులు యర్రంశెట్టి సునీల్, మెళ్ళమర్తి లంక గ్రామ అధ్యక్షులు తోట శ్రీనివాస్, మత్తి సుబ్రమణ్యం, అర్జా కాంత్, శోబిల రాఘవ, తుంగల నరేష్, కూరేటి జగన్, చావాకుల సురేష్, రాఘవ కూరేటి, నియోజకవర్గ స్థాయి మరియు మోపిదేవి మండల నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/08/WhatsApp-Image-2023-08-12-at-9.17.11-PM-1024x485.jpeg)