జనంలోకి జనసేన పాదయాత్రకు శ్రీకారం చుట్టిన నేమూరి శంకర్ గౌడ్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయ సిద్ధాంతాలను ప్రజల ముందుకు తీసుకొచ్చే విధంగా కూకట్ పల్లి నియోజకవర్గం ఓల్డ్ బోయిన్పల్లి 119-డివిజన్ నుండి తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్ జనంలోకి జనసేన పాదయాత్ర కార్యక్రమంను ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ రాష్ట్ర మరియు కూకట్ పల్లి ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య లక్ష్యం జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రజల వద్దకు తీసుకువెళ్లడం. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో మరియు నియోజకవర్గంలో ఉన్న సమస్యలు తెలుసుకోవడం అని అన్నారు. పాదయాత్రలో తిరిగినప్పుడు పలుబస్తీలలో త్రాగు నీరు, రోడ్లు, సమస్యలు ఉన్నాయని ప్రజలు శంకర్ గౌడ్ గారికి విన్నపించు కున్నారని, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం వెంటనే ఈ యొక్క సమస్యలు తీర్చాలని అన్నారు, తాము జనసేన తరపున రాజకీయ వ్యవస్థలో మార్పు దిశగా అడుగులు వేస్తున్నామని అన్నారు. జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిని మనసారా ఆదరించాలని కోరుకున్నారు. రాబోయే రోజులలో ప్రజలందరూ తమకు సహకరించాలని, ప్రజలకు సేవ చేస్తానికి తాను మరియు జన శ్రేణులు తోడుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో బోయిన్పల్లి డివిజన్ నాయకులు లక్ష్మణరావు, లింగలరాజు, విష్ణు సాయి, హైదరాబాద్ కమిటీ సెక్రటరీ. మండలి దయాకర్, డివిజన్ కోఆర్డినేటర్లు కొల్లా శంకర్ వేముల మహేష్, వెంకటేశ్వరరావు, నాగేంద్ర, నాగరాజు, వీర మహిళలు కావ్య, భాగ్యలక్ష్మి, వెంకటలక్ష్మి, మహాలక్ష్మి, మల్లేశ్వరి, మరియు జన శ్రేణులు మరియు వీరమహిళలు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/08/WhatsApp-Image-2023-08-13-at-9.21.01-PM-1024x573.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/08/WhatsApp-Image-2023-08-13-at-9.21.02-PM-1024x462.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/08/WhatsApp-Image-2023-08-13-at-9.21.02-PM-1-1024x462.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/08/WhatsApp-Image-2023-08-13-at-9.20.59-PM-1024x462.jpeg)