డేగల మడుగు, లెనిన్ నగర్ గ్రామాల్లో వేముల కార్తిక్ పర్యటన

కొత్తగూడెం: సుజాతనగర్ మండలంలోని నాయకులగూడెం, డేగల మడుగు, లెనిన్ నగర్ గ్రామాల్లో జనసేన కొత్తగూడెం నియోజకవర్గ ఇంచార్జి వేముల కార్తిక్ పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని వారికి రాబోయే రోజుల్లో అండగా ఉంటామని తెలియచేశారు. అలాగే అసెంబ్లీ ఎలక్షన్స్ లో కొత్తగూడెంలో జనసేన పోటీ చేస్తున్నందున జనసేనకి ఓటు వేసి గెలిపించమని జనసేన నాయకులు కొత్తగూడెం టౌన్ ప్రెసిడెంట్ సాదిక్ పాషా, చుంచుపల్లి ప్రెసిడెంట్ హాథిరామ్, పండు, సాయి తదితరులు కోరారు.