జనసేన తరపున విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు

ఎచ్చెర్ల నియోజకవర్గం: కవిటి మండలం, కుసుంపురం గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2022-23 సంవత్సరమునకు ప్రధమ, ద్వితీయ, తృతీయ మరియు 500 మార్కులు పైబడిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు కుసుంపురం జనసేన నాయకుడు బొడ్డు నవీన్ ఆర్ధిక సహాయంతో రూ.5000 జనసేన పార్టీ తరపున అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు, మాతృమూర్తి యువజనసేవా సంఘం సభ్యులు, గ్రామ యువత పాల్గొన్నారు. కుసుంపురం జనసేన పార్టీ సర్పంచ్ అభ్యర్థి ఎ.సురేష్ కుమార్, జనసేన నాయకులు సింధుల చలపతి, బీజేపీ నాయకులు నల్లాన నాగు చేతులమీదుగా అందజేయడం జరిగింది.