జనసేన తరపున విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు
ఎచ్చెర్ల నియోజకవర్గం: కవిటి మండలం, కుసుంపురం గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2022-23 సంవత్సరమునకు ప్రధమ, ద్వితీయ, తృతీయ మరియు 500 మార్కులు పైబడిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు కుసుంపురం జనసేన నాయకుడు బొడ్డు నవీన్ ఆర్ధిక సహాయంతో రూ.5000 జనసేన పార్టీ తరపున అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు, మాతృమూర్తి యువజనసేవా సంఘం సభ్యులు, గ్రామ యువత పాల్గొన్నారు. కుసుంపురం జనసేన పార్టీ సర్పంచ్ అభ్యర్థి ఎ.సురేష్ కుమార్, జనసేన నాయకులు సింధుల చలపతి, బీజేపీ నాయకులు నల్లాన నాగు చేతులమీదుగా అందజేయడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/08/WhatsApp-Image-2023-08-15-at-4.44.00-PM-1-1024x1024.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/08/g-1024x576.jpg)