జాతీయ జెండాను ఆవిష్కరించిన సరికొప్పుల నాగేశ్వరరావు

హుజూర్నగర్ నియోజకవర్గం: నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జనసేన పార్టీ హుజూర్నగర్ నియోజకవర్గం ఇంచార్జి సరికొప్పుల నాగేశ్వరరావు పాల్గొని జెండా ఆవిష్కరణ చేయడం జరిగినది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధులను స్ఫూర్తిగా తీసుకొని యువత మంచి మార్గంలో సమాజ అభ్యున్నతికి పాటుపడాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు, కొమ్మరాజు శ్రీను, సాయి చరణ్, మధు, చందు, జంపాల రాకేష్ నాయుడు, రంజాన్ మట్టయ్య, హుస్సేన్, వెంకన్న మరియు విద్యార్థులు స్థానిక ప్రజలు పాల్గొనడం జరిగినది.