జాతీయ జెండాను ఆవిష్కరించిన బొర్రా

సత్తెనపల్లి నియోజకవర్గం: స్పార్కింగ్ స్టార్ స్కూల్ యాజమాన్యం ఆహ్వానం మేరకు మంగళవారం 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్యఅతిథిగా సత్తెనపల్లి నియోజకవర్గ నాయకులు బొర్రా వెంకట అప్పారావు పాల్గొని త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసారు. ఈ సందర్భంగా బొర్రా వెంకట అప్పారావు మాట్లాడుతూ ముందుగా పార్కింగ్ స్టార్ స్కూల్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుతూ.. ఎందరో మహనీయుల త్యాగాల ఫలితమే మనకు ఈనాటి స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు అని ఆ మహనీయుల త్యాగాలను సదా స్మరిస్తూ ఉండాలి అని నాయకులు పేర్కొన్నారు.