తిరుపతిలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో జనసేన నేతలు

తిరుపతి: స్వతంత్ర భారతావనికి ఊపిరినందించడానికి అసువులు బాసిన త్యాగధనులను స్మరించుకుంటూ.. తిరుపతి జనసేన జిల్లా పార్టీ కార్యాలయం నందు జెండా వందన కార్యక్రమం నిర్వహించి ఘనంగా 77వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్న జిల్లా అధ్యక్షుడు డా. పసుపులేటి హరిప్రసాద్, పట్టణ అధ్యక్షుడు రాజారెడ్డి, ఆకేపాటి సుభాషిని, బీగాల అరుణ, లక్ష్మీ, దుర్గ, లావణ్య, చందన, మునుస్వామి, గుట్టా నాగరాజ్, హిమవంత్, రమేష్ నాయుడు, కిషోర్, పురుషోత్తం, సాయి, భాషా, రాజేంద్ర, కౌషిక్, పురుషోత్తం మరియు ముఖ్య నేతలు, వీరమహిళలు, జనసైనికులతో కలిసి దేశప్రజలందరికీ వారు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కుటుంబం తరువాత సమాజం పట్ల ప్రతిఒక్కరూ బాధ్యతతో వ్యవహరించాలని, ప్రపంచ పటంలో దేశాన్ని అగ్రగామిగా నిలపడంలో ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎప్పుడు దేశంకోసం ప్రాణాలు అర్పించిన మహనీయులను గుర్తు చేస్తూ వుంటారని గుర్తుచేశారు.