గంగారపు ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
మదనపల్లి నియోజకవర్గం: మదనపల్లి కమ్మవీధిలో జనసేన పార్టీ కార్యాలయంలో మంగళవారం భారత 77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా వేడుకలు జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రాందాస్ చౌదరి ఆధ్వర్యంలో జనసేన నాయకులు కార్యకర్తలతో కలసి జాతీయ పతాకం ఆవిష్కరణ చేసి మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గంగారపు రాందాస్ చౌదరి మాట్లాడుతూ జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఒక చేతిలో జాతీయ పతకాన్ని ఒక చేతితో జనసేన జెండా పట్టుకొని ఉద్యమం ప్రారంభించడం జరిగిందని, అదే విధంగా జనసైనికులు మంచి తరాల భవిష్యత్తు కోసం కృషి చేస్తాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం రాయల్, రాష్ట్ర చేనేత విభాగ నాయకులు అడపా సురేంద్ర, మదనపల్లి రూరల్ మండల అధ్యక్షులు గ్రానైట్ బాబు,లక్ష్మీనారాయణ, రెడ్డెమ్మ, కుమార్, గజ్జల రెడ్డెప్ప, శేఖర, నవాజ్, సురేష్, లవన్న తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/08/WhatsApp-Image-2023-08-15-at-8.29.02-PM-1024x576.jpeg)