జనసేన ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ కు ఘన నివాళులు

కూకట్‌పల్లి: బహుజన విప్లవకారుడు శ్రీ శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ 374వ జయంతి సందర్భంగా కూకట్పల్లి నియోజకవర్గంలోని బాలానగర్లో వారి విగ్రహానికి పూలమాలవేసి జనసేన పార్టీ రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్ మరియు గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు రాధారాం రాజలింగం ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నేమూరి శంకర్ గౌడ్ మాట్లాడుతూ శ్రీ సర్దార్ పాపన్న గౌడ్ తెలంగాణ తొలిరాజు, బహుజన రాజ్యాధికార పోరాడిన యోధుడు మొగలాయి దౌర్జన్యాలను ఎదురించి తెలంగాణ ప్రాంతాన్ని కాపాడిన వీరుడు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కూకట్పల్లి నియోజకవర్గం కోఆర్డినేటర్ గడ్డం నాగరాజ కిషోర్, కొల్లా శంకర్, తుమ్మల మోహన్ కుమార్, వేముల మహేష్, నాగేంద్ర మరియు బాలనగర్ జనసేన పార్టీ నాయకులు ఎస్.కె. నాగూర్, నరేష్ వెంకట్రావు, రాము జనసైనికులు పాల్గొన్నారు.