వ్యాక్సిన్ తీసుకున్న ఆశావర్కర్ మృతి
ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో విషాదం చోటుచేసుకున్నది. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న ఓ ఆశావర్కర్ మరణించారు. జిల్లాలోని తాడేపల్లి మండలం పెనుమాకలో విజయలక్ష్మి ఆశా వర్కర్గా పనిచేస్తున్నారు. వ్యాక్సినేషన్లో భాగంగా ఈ నెల 19న ఆమె టీకా వేయించుకున్నారు. అయితే రెండు రోజుల్లోనే అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను జీజీహెచ్లో చేరాయి. దవాఖానలో చికిత్స పొందుతూ మరణించారు. బ్రెయిన్ స్ట్రోక్తో చనిపోయినట్లు ఆమెకు చికిత్స అందిస్తున్న వైద్యులు ఆదివారం ఉదయం ప్రకటించారు.