గెడగాం గ్రామంలో జనసేన టీమ్ పర్యటన

పాలకొండ నియోజకవర్గం: వీరఘట్టం మండలం గెడగాం గ్రామంలో వీరఘట్టం మండల జనసేన టీమ్ పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన జానీ మాట్లాడుతూ.. పాలకొండ నియోజకవర్గం భామిని మండలంకి చెందిన ప్రముఖ సీనియర్ నాయుకులు మాజీ జడ్పీటీసీ గిరిజన నేత నిమ్మల నిబ్రమ్ గారు జనసేన పార్టీలో జాయిన్ అయిన సందర్బంగా మొదటిగా మన వీరఘట్టం మండలంలో పరిచయ వేదిక కార్యక్రమం ఆగస్టు 25వ తేదిన కడకెల్ల(కొసకెళ్ళ) గ్రామంలో ఉదయం 10:15 నిముషాలకి కడకెల్ల గ్రామంలో ఉన్న గ్రామ దేవత ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమంలు చెయ్యడం జరుగుతుంది. అనంతరం కడకెళ్ళ గ్రామంలో ఉన్నప్రతి వీధిలో ర్యాలిగా వెళ్లి అనంతరం వీరఘట్టం వరుకు భారీ బైక్ ర్యాలితో వెళ్ళి జనసేన ముఖ్య ఉదేశ్యం, వీరఘట్టం మండల ప్రధాన సమస్యలుపైన అంబేద్కర్ జంక్షన్ లో నిమ్మల నిబ్రమ్ గారు కొంత సమయం ప్రజా సమస్యలపై మాట్లాడటం జరుగుతుంది. కావున ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేసే బాధ్యత గెడగాం గ్రామ జనసేన నాయుకులు, జనసైనికులు బాధ్యత తీసుకోవాలని జనసేన పార్టీ చేపట్టే భారీ ర్యాలీనీ విజయవంతం చెయ్యాలి అని కోరుకుంటున్నామని జానీతెలియజేసారు. ఈ కార్యక్రమంలో మత్స పుండరికం, కర్నెన సాయిపవన్, కోడి వెంకట్ నాయుడు గెడగాం గ్రామ జనసేన నాయుకులు పాల్గొన్నారు.