ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ సమావేశంలో పాల్గొన్న సరికొప్పుల
హుజూర్నగర్ నియోజకవర్గం: నియోజకవర్గంలో అన్ని రాజకీయ పార్టీ ప్రతినిధులతో హుజూర్నగర్ ఆర్డీవో ఆఫీస్ నందు గురువారం ఆర్డీవో సమక్షంలో ఓటరు నమోదు, తొలగింపులు, మార్పులు, అభ్యంతరములు మరియు సాధారణ ఎన్నికల గురించి సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులతో పాటు జనసేన పార్టీ తరఫున హుజూర్నగర్ నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ సరికొప్పుల నాగేశ్వరరావు హాజరైనారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/08/sar-1024x576.jpg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/08/WhatsApp-Image-2023-08-24-at-5.58.43-PM.jpeg)