జనసైనికుడు యుగంధర్ కు భీమా చెక్కు అందజేసిన గిరడ అప్పలస్వామి

బొబ్బిలి నియోజకవర్గం: రామభద్రపురం మండలం, బుసాయి వలస గ్రామానికి చెందిన జనసైనికుడు సువ్వాడ యుగంధర్ ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో గాయపడడం జరిగింది. యుగంధర్ జనసేన క్రియాశీలక సభ్యత్వం కలిగిఉన్నందున 17 వేల రూపాయల ప్రమాద బీమా చెక్కుని, జనసేన కార్యకర్తలకు ఎల్లవేళలా అండగా ఉంటున్న జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ బొబ్బిలి జనసేన పార్టీ ఆఫీస్ కి పంపించడం జరిగింది. గురువారం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు బొబ్బిలి నియోజకవర్గం ఇంచార్జ్ గిరడ అప్పలస్వామి చేతుల మీదగా సువ్వాడ యుగంధర్ కి మరియు కుటుంబ సభ్యులైన సీతారాం, తిరుమల, శివలకు చెక్కును అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలొ ఉల్లి సంతోష్, ప్రసాద్, శ్రీను మరియు భూసాయ వలస గ్రామ జనసైనికులు పాల్గొనడం జరిగింది.