పవనన్న ప్రజాబాట కార్యక్రమంలో బొర్రా

సత్తెనపల్లి నియోజకవర్గం: నకరికల్లు మండలం, నకరికల్లు అడ్డరోడ్డులో జనసేన మండల అధ్యక్షురాలు తాడువాయి లక్ష్మీ శ్రీనివాస్ మరియు అడ్డరోడ్డు గ్రామ జనసైనికులు ఆహ్వానం మేరకు ఇంటింటికి పవనన్న ప్రజాబాట కార్యక్రమాని నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి సత్తెనపల్లి నియోజకవర్గ జనసేన నాయకులు బొర్రా వెంకట్ అప్పారావు ముఖ్యఅతిథిగా విచ్చేయడం జరిగినది. సత్తెనపల్లి నియోజకవర్గంలో గత కొన్ని నెలలుగా జనసేన పార్టీ నాయకులు బొర్రా వెంకట అప్పారావు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “ఇంటింటికి పవనన్న ప్రజాబాట” కార్యక్రమంలో భాగంగా గురువారం నకరికల్లు అడ్డరోడ్డులో ముందుగా ఆంజనేయస్వామి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అడ్డరోడ్డు గ్రామంలో ప్రతి ఇంటికి పవన్ కళ్యాణ్ గారి మేనిఫెస్టోని, సిద్ధాంతాలను కరపత్రాల ద్వారా గ్రామస్తులకు చేరవేయడం జరిగినది. ఈ సందర్భంగా స్థానికులు పలుసమస్యలను జనసేన పార్టీ ధృష్ఠికి తీసుకొచ్చారు. అందులో ప్రధానంగా డ్రైనేజీ సమస్య, గత నెల రోజుల నుండి కరెంటు కోతలు, సాగునీటి సమస్యలు సత్తనపల్లి నియోజకవర్గం నాయకులు బొర్రా వెంకట అప్పారావు దృష్టికి తీసుకురావడం జరిగినది. ఈ కార్యక్రమంలో నకరికల్లు మండల అధ్యక్షురాలు తాడువాయి లక్ష్మీ శ్రీనివాస్, వైస్ ప్రెసిడెంట్ షేక్ రఫీ సత్తెనపల్లి రూరల్ మండలం అధ్యక్షులు నాదెండ్ల నాగేశ్వరరావు, సత్తెనపల్లి ఏడవ వార్డు కౌన్సిలర్ రంగిశెట్టి సుమన్, ముప్పాళ్ళ మండల అధ్యక్షులు సిరిగిరి పవన్ కుమార్, ప్రోగ్రామింగ్ కమిటీ సభ్యులు భక్తుల కేశవ, మండల కార్యదర్శి మురళి, పసుపులేటి పవన్ కళ్యాణ్, గాదే సాంబశివరావు, అంజిబాబు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొనడం జరిగినది.