ముప్పాళ్ళ గ్రామంలో పవనన్న ప్రజాబాటలో బొర్రా

సత్తెనపల్లి నియోజకవర్గం: ముప్పాళ్ళ మండలం, ముప్పాళ్ళ గ్రామంలో శనివారం ముప్పాళ్ళ మండల జనసేన పార్టీ అధ్యక్షులు సిరిగిరి పవన్ కుమార్ మరియు వైస్ ప్రెసిడెంట్ ఎస్.కె గౌస్ ఆధ్వర్యంలో ముప్పాళ్ళ గ్రామంలో ఇంటింటికి పవనన్న ప్రజాబాట అనే కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సత్తెనపల్లి నియోజకవర్గ నాయకులు బొర్రా వెంకట అప్పారావు పాల్గొని గ్రామంలోని ప్రతి ఇంటికి పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలను ఆశయాలను పార్టీ మేనిఫెస్టోలో కరపత్రాల రూపంలో ప్రతి ఇంటికి చేరడం జరిగినది. ఈ సందర్భంగా బొర్రా వెంకట్ అప్పారావు మాట్లాడుతూ చంద్రయాన్ -3 విజయవంతం చేసిన శాస్త్రవేత్తలకు అభినందనలు తెలియజేయడం జరిగినది. మరియు తిరుమల తిరుపతికి వెళ్లే భక్తులకు చేతి కర్రలతో రక్షణ కాకుండా మెరుగైన రక్షణ వ్యవస్థని నెలకొల్పాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరిగినది. వాలంటీర్లు కూడా రాష్ట్ర ప్రభుత్వ కుట్రని అర్థం చేసుకోవలసిందిగా కోరడమైనది. మరియు స్థానిక సమస్యలైనా రోడ్లు, డ్రైనేజీ సమస్య, వీధి దీపాలు, పారిశుభ్రత, దోమల బెడద, గత నెల రోజుల నుండి కరెంటు కోతలు, సాగునీటి, తాగునీటి సమస్యలను సత్తనపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు బొర్రా వెంకట అప్పారావు దృష్టికి తీసుకురావడం జరిగింది. వారు సమస్యల గురించి సానుకూలంగ స్పందించి, సమస్యల పరిష్కారానికి జనసేన పార్టీ తరుపున హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కమిటీ సభ్యులు కౌన్సిలర్ ప్రోగ్రాం కమిటీ మెంబర్స్ మండల అధ్యక్షులు మండల కమిటీ సభ్యులు, గ్రామ అధ్యక్షులు, గ్రామ కమిటీ సభ్యులు, జనసైనికులు, వీరమహిళలు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు.