కార్వేటి నగరంలో నూతన జనసేన పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం

గంగాధర నెల్లూరు, జనసేన పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా జీడీ నెల్లూరు నియోజకవర్గ పరిధిలోని కార్వేటి నగరంలో నూతన జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జనసేన పార్టీ రాష్ట్ర పిఏసి సభ్యులు మరియు ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా.పసుపులేటి హరిప్రసాద్ పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా జీడీ నెల్లూరు ఇంచార్జి పొన్న యుగంధర్ మాట్లాడుతూ ఉమ్మడి చిత్తూరు జిల్లా నాయకులకు, జీడీ నెల్లూరు నాయకులకు, వీర మహిళలకు మరియు జనసైనికులకు హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు. జీడీ నెల్లూరు నియోజకవర్గంలో జనసేన ఓఅర్టీ విజయకేతన దిశగా అందరం కలిసి మరింత కృషి చేస్తాము అని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో జీడీ నెల్లూరు ఇంచార్జి పొన్న యుగంధర్, ఉమ్మడి చిత్తూరు జిల్లా గౌరవ అధ్యక్షులు కృష్ణయ్య, రాయలసీమ కో-కన్వినర్ రాందాస్ చౌదరి, రాయలసీమ మహిళా కోర్డినేటర్ ఆకుల వనజ ప్రధాన కార్యదర్శ్లు దారం అనిత, జంగాల శివరాం, కార్యదర్సలు భానుప్రసాద్, ఆనంద్, కలప రవి, బాటసారి, సంయుక్త కార్యదర్సులు రాఘవ, బీగల అరుణ, జీడీ నెల్లూరు ఆరు మండల అధ్యక్షులు, నియోజకవర్గ నాయకులు, వీరమహిళలు లావణ్య, మధులత మరియు జనసైనికులు పాల్గొన్నారు.