యాదమరి మండల సర్వసభ్య సమావేశం

పూతలపట్టు, యాదమరి మండల కేంద్రంలో, మండల అధ్యక్షుడు కుమార్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ సర్వసభ్య సమావేశం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న జనసైనికులకు కిట్లను అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా కుమార్ మాట్లాడుతూ యాదమరి మండలంలో జనసేన పార్టీ బలోపేతం కోసం ప్రతి ఒక్క జనసైనికుడు సహకరించాలని, పోలింగ్ బూత్ కమిటీలో బాధ్యతలు తీసుకొని జనసేన ఓటును 2024 లో పదిలంగా బ్యాలెట్ బాక్స్ లో చేర్చే బాధ్యత తీసుకోవాలని, ఓటర్ లిస్టులోని అవకతవకలు నిర్మూలించడానికి పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి నెహ్రు రాయల్, పూతలపట్టు మండల అధ్యక్షులు మనోహర్, జనసేన పార్టీ సీనియర్ నాయకులు నానబాల లోకేష్ తో పాటు మండల కార్యవర్గ సభ్యులు, జనసైనికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.