జనసేనాని జన్మదిన వారోత్సవాలకు శ్రీకారం చుట్టిన బత్తుల

  • మహారక్తదాన శిబిరానికి భారీ స్పందన

రాజానగరం నియోజకవర్గం: జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జన్మదినం పురస్కరించుకొని పవన్ కళ్యాణ్ జన్మదిన వారోత్సవాలకు రజానగరం జనసేన నాయకులు బత్తుల బలరామ కృష్ణ శ్రీకారం చుట్టారు. ఈ వేడుకలలో భాగంగా కోరుకొండ మండలం, బూరుగుపూడి గేట్ వద్ద గల నాగసాయి ఫంక్షన్ హాల్ నందు మహా రక్తదాన శిబిరాన్ని బత్తుల మహా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసారు. బత్తుల ఏర్పాటు చేసిన మహా రక్తదాన శిబిరం కార్యక్రమానికి భారీ స్పందన వచ్చింది. ఈ కార్యక్రమంలో రాజానగరం నియోజకవర్గంలో మూడు మండలాల నుండి భారీ సంఖ్యలో జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు. సుమారు 1500 మంది రక్తదాన కార్యక్రమంలో పాల్గొని రక్తదానం చేసారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నలుమూలల నుండి భారీగా జనసేన నాయకులు, జనసైనికులు, జనశ్రేణులు పాల్గొన్నారు.