సిఎం జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే భిక్షం ఎత్తుకోవాల్సిందే

  • నగిరిలో రోజా చేసిన విమర్శలపై భగ్గుమన్న జనసేన పార్టీ
  • గతంలో రోజా స్థితి ఏంటి
  • నేడు మంత్రిగా హోదా స్థాయిని ప్రశ్నించిన జనసేన కిరణ్ రాయల్

తిరుపతి, రాష్ట్ర సీఎం జగన్ మోహన్ రెడ్డి నగిరి పర్యటనలో భాగంగా విద్యా దీవెన కార్యక్రమంలో పాల్గొనడానికి వస్తే, సీఎం మెప్పు పొందడానికి మంత్రి రోజా ప్రతిపక్షాలను విమర్శిస్తూ జనసేన పార్టీని విమర్శస్తూ జగనన్నను నమ్ముకుంటే కుటుంబం చల్లగా ఉంటుందని అనడం పట్ల జనసేన పార్టీ నేతలు కిరణ్ రాయల్, ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో సోమవారం మీడియాతో వీరు మాట్లాడుతూ రోజా అవ్వకు ఎన్నిసార్లు తాము చెప్పినా బరితెగించి విమర్శలు చేయడం తగదని హెచ్చరించారు. నిజానికి చెప్పాలంటే, జగనన్నను నమ్ముకుంటే ఇసుకను అమ్ముకోవచ్చునని భారీ విమర్శలు చేశారు. ఈసారి రోజాకు వైకాపాలో సీటు లేదని ఇచ్చే అవకాశం ఉంటే సీఎం జగన్ నగిరిలో ఈరోజు ప్రకటించే వారన్నారు. కానీ ఒకటి నిజమని, నూరు ఎకరాల గంజాయి తోటను రోజకు ఇచ్చి ఒకవేళ నెక్స్ట్ ఫ్యాన్ పార్టీ వస్తే గంజాయి బిజినెస్ చేసుకునేలా ప్లాన్ చేసి ఉంటారన్నారు. ఈ వ్యాపారం రోజాకి కరెక్ట్ అన్నారు. తమ జనసేనాని పవన్ కళ్యాణ్ సినిమాల గురించి మాట్లాడే ముందు రోజా ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాలన్నారు. సినిమాల్లో రోజా ఎదగడానికి ఎన్ని బాగోతాలు చేసిందో గుర్తుతెచ్చుకోవాలన్నారు. గతంలో జగనన్న ను నమ్ముకుని ఐఏఎస్ అధికారులు శ్రీలక్ష్మితో పాటు ఎంతోమంది జైలుకెల్లారన్నారు. రోజుకో కారు, ఇల్లు కొనే రోజా, నీ అవినీతి ఆస్తి ఎంతో మా దగ్గర చిట్టా ఉందని హెచ్చరించారు. మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మీడియా సమావేశంలో నగర అధ్యక్షుడు రాజారెడ్డి, రాజమోహన్, హేమ కుమార్, రాజేష్ ఆచారి, మునస్వామి, కిషోర్, రమేష్, ఆది, మధు తదితరులు పాల్గొన్నారు.