మైలవరం నియోజకవర్గ కార్యకర్తల సమావేశం

మైలవరం, స్థానిక జనసేనపార్టీ కార్యాలయంలో మైలవరం నియోజకవర్గ కార్యకర్తల సమావేశం ఆదివారం రాత్రి అక్కల గాంధీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గాంధీ మాట్లాడుతూ మైలవరం నియోజకవర్గంలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన గెలుపే ధ్యేయంగా పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బూత్ స్థాయిలో జనసేనపార్టీ బలోపేతమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని సూచించారు. పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలు, మేనిఫెస్టోను మరింత బలోపేతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కోరారు. జనసేనపార్టీ మైలవరం నియోజకవర్గంలో స్థానిక సమస్యలతోపాటు, పార్టీ సూచించిన అన్ని కార్యక్రమాలను విజయవంతంగా చేస్తుందని, దీనికి ముఖ్య కారణం జనసైనికుల కృషి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ ఉమ్మడి కృష్ణా జిల్లా కార్యదర్శి చింతల లక్ష్మీకుమారి, జనసేనపార్టీ మైలవరం, రెడ్డిగూడెం, ఇబ్రహీంపట్నం మండల అధ్యక్షులు శీలం బ్రహ్మయ్య, చాపలమడుగు కాంతారావు, పోలిశెట్టి తేజ, మండల ఉపాధ్యక్షులు పాములపాటి సుందర్ రామిరెడ్డి, పడిగెల ఉదయ్, కొండపల్లి మునిసిపాలిటీ నాయకులు చెరుకుమల్లి సురేష్, అడపా శివ, ఎర్రంశెట్టి నాని, సామల సుజాత, సీనియర్ నాయకులు కటకం ధర్మారావు మరియు మండల కమిటీ సభ్యులు, జన సైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.