నందికొట్కూరు నియోజకవర్గంలోని జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వాల పంపిణీ

నందికొట్కూరు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో క్రియాశీలక సభ్యత్వాల పంపిణీ జరుగుతుంది. ముఖ్యంగా నెహ్రు నగర్ గ్రామస్తులు జనసేన పట్ల సంతోషం వ్యక్తపరుస్తున్నారు. వైసీపీ పాలనలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నామని, యువతకు ఉద్యోగాలు లేక వేరే ఊర్లకు వలసలు వెళుతున్నామని వాపోయారు. వర్షాలు లేక ఇబ్బందులు పడుతున్న సమయంలో పంటలకు కరెంటు కోతలు విధించి వైసిపి ప్రభుత్వం ఇంకా నష్టపరుస్తుందని వాపోయారు. జనసేన ప్రభుత్వం ఏర్పడ్డాక భావితరాల భవిష్యత్తు బాగుపడుతుందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం నల్లమల రవికుమార్ మాట్లాడుతూ వెళ్లిన ప్రతిచోట ప్రజలు వైసీపీ పాలన పట్ల అసంతృప్తి వ్యక్తపరుస్తున్నారని తెలియజేశారు. జనసేన ప్రభుత్వం వచ్చాక యువతకు ఉద్యోగాలు కల్పించి భావితరాలకు భరోసా ఇస్తుందని తెలియజేశారు.