పద్మ అవార్డులను ప్రకటించిన కేంద్రం.. ఏడుగురు క్రీడాకారులకు పద్మశ్రీ..

కేంద్ర ప్రభుత్వం 2021 సంవత్సరానికి సంబంధించి పద్మ అవార్డుల జాబితాను విడుదల చేసింది. ఈ ఏడాది 119 మంది పద్మ పురస్కారాలు ప్రకటించింది. వీరిలో ఏడుగురికి పద్మ విభూషణ్ పురస్కారాలు ప్రకటించగా.. 10 మందికి పద్మ భూషణ్ అవార్డులు ప్రకటించింది. 102 మంది పద్మ శ్రీ పురస్కారాలు ప్రకటించింది.

అయితే ఇందులో క్రీడా విభాగంలో ఏడుగురికి పద్మశ్రీ అవార్డు లభించాయి. పీ అనిత (తమిళనాడు), మౌమా దాస్‌ (పశ్చిమబెంగాల్‌), అన్షు జంసేన్సా (అరుణాచల్‌ప్రదేశ్‌), మాధవన్‌ నంబియార్‌ (కేరళ), సుధా హరినారయణ్‌ సింగ్‌ (ఉత్తరప్రదేశ్‌), వీరేంద్ర సింగ్‌ (హరియాణా), కే.వై వెంకటేశ్‌ (కర్ణాటక).