మైలవరం నియోజకవర్గ జనసేన నాయకుల సమావేశం

మైలవరం నియోజకవర్గం: మైలవరంలోని స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో మైలవరం నియోజకవర్గ నాయకుల సమావేశం అక్కల గాంధీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా అక్కల గాంధీ మాట్లాడుతూ మైలవరం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవ వేడుకలు సెప్టెంబర్ 1వ తేదీ మరియు 2వ తేదీన ఘనంగా నిర్వహించబడతాయని, పార్టీ సూచించిన విధంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలియజేశారు. సెప్టెంబర్ ఒకటవ తేదీన ఉదయం రెడ్డిగూడెం మండలంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన తరువాత మైలవరంలో సాయంత్రం 4 గంటలకు నియోజకవర్గస్థాయిలో ముందస్తుగా పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవం సందర్భంగా ర్యాలీగా వెళ్లి కేక్ కటింగ్ కార్యక్రమం జరుగుతుందని తెలియజేశారు. అదేవిధంగా ఇబ్రహీంపట్నం, జి.కొండూరు, విజయవాడ రూరల్ మండలాలలో సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మైలవరం, రెడ్డిగూడెం, ఇబ్రహీంపట్నం, జి.కొండూరు మండల అధ్యక్షులు శీలం బ్రహ్మయ్య, చాపలమడుగు కాంతారావు, పోలిశెట్టి తేజ, ఎర్రబోలు నరసింహారావు మండల ఉపాధ్యక్షులు పాములపాటి సుందర్ రామిరెడ్డి, పడిగెల ఉదయ్, కొండపల్లి మునిసిపాలిటీ నాయకులు చెరుకుమల్లి సురేష్, ఎర్రంశెట్టి నాని, రాగాల నాని, సాయి, మైలవరం మండల కమిటీ సభ్యులు కూసుమంచి కిరణ్ కుమార్, ఈత కొట్టు నాని, జనసైనికులు పాల్గొన్నారు.