జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ

  • జనసేనని శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వారోత్సవాల్లో భాగంగా 3వ రోజు ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ కార్యక్రమం విజయవంతం

పార్వతీపురం నియోజకవర్గం: జనసేన నాయకులు అక్కివరపు మోహన్ రావు ఆధ్వర్యంలో మరియు మండల అధ్యక్షురాలు శ్రీమతి ఆగూరు మణి, పార్వతీపురం జనసేన పార్టీ సమక్షంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వారోత్సవాల్లో భాగంగా సోమవారం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే రోగులు వేగంగా కోలుకోవాలని, పౌష్టికాహారం తీసుకోవాలని వైద్యులు సూచించిన సమయానికే మందులు వేసుకోవాలని, అలాగే రోగులకు మెరుగైన వైద్య సదుపాయం గూర్చి, రోగులను అడిగి తెలుసుకున్నారు. ఈ మహత్తర కార్యక్రమంలో రాజానబాలు, ఖాతా విశ్వేశ్వరావు, గుంట్రెడ్డి గౌరిశంకర్, అల్లు రమేష్, బొండపల్లి జనార్ధన, కర్రి మణికంఠ, చిట్లి గణేశ్వర రావు, గొలగాన సత్యనారాయణ, అన్నబత్తుల దుర్గప్రసాద్, అంబటి బలరాం, కనకరాజు, పైల రాజు, బోనుల గోవిందమ్మ, రాజన్న బాలు, దుర్గ ప్రసాద్, పాత్ర పవన్, తెర్లి లక్ష్మణ్, మాచర్ల శేఖర్, చెరుకు బిల్లి అనిల్, గుల్లిపల్లి రాజా, బొండపల్లి ప్రసాద్, అశోక్, సాయి, మహేష్, కేశవ, శంకర్, ప్రశాంత్, జనసైనికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పాల్గొన్న ప్రతి జనసైనికులకి, జనసేన నాయకులు పేరు పేరునా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.