జనసేన క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ
కడప: జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జనసేన కుటుంబసభ్యుల భద్రత కోసం చేపట్టిన క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ కార్యక్రమం కడప జనసేన పార్టీ కార్యాలయంలో కడప జనసేన ఇంచార్జ్ సుంకర శ్రీనివాస్ అధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా నియోజికవర్గ పరిధిలో పనిచేస్తున్న జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులకు సభ్యత్వ కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కోర్ కమిటీ సభ్యులు పండ్రా రంజిత్ కుమార్, పత్తి విస్సు, బోరెడ్డి నాగేంద్ర, స్వరూప్, మాలె శివ, చార్లెస్, నాగరాజు, చిన్నా, అంజి, అలీ, మల్లి, రంగ, బాలు, కుమార్, సుధీర్, దేవా, రాంమోహన్, తోట సుమన్, తదితరులు పాల్గోన్నారు.