పగిడ్యాల మండలంలో క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ
నందికొట్కూరు నియోజకవర్గం: పగిడ్యాల మండలంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జనసేన కుటుంబసభ్యుల భద్రత కోసం చేపట్టిన క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా
నందికొట్కూరు నియోజకవర్గంలోని పగిడ్యాల మండలంలో జనసేన క్రియాశీలక సభ్యత్వం చేయించుకున్న వారికి బుధవారం కిట్లు పంపిణీ చేయడం జరిగింది.
జనసేన కుటుంబసభ్యుల భద్రత కోసం 5 లక్షల బీమా వర్తించే జనసేన పార్టీ ఇన్సూరెన్స్ విధానం పెట్టడం ప్రజలకి చాలా మేలు చేకూరుతుందని ప్రజలు వారి మాటల్లో తెలియజేశారు. పగిడ్యాల మండలంలో ప్రజలు జనసేన జెండా పట్టుకోవడానికి చాలా ఉత్సాహం చూపిస్తున్నారు. 2024 ఎన్నికల్లో జనసేన ప్రభుత్వం ఏర్పడాలని ఆశతో ఎదురుచూస్తున్నారు. ఈ కార్యక్రమంలో నల్లమల రవికుమార్ పాల్గొని కిట్ల పంపిణీ చేయడం జరిగింది. ప్రజల ఉత్సాహాన్ని చూసి మీ అభివృద్ధి కేవలం జనసేన పార్టీతోని మాత్రమే సాధ్యమవుతుందని తెలియజేయడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/08/WhatsApp-Image-2023-08-30-at-10.06.13-PM-1024x461.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/08/WhatsApp-Image-2023-08-30-at-10.06.13-PM-1-1024x461.jpeg)