గణపతి, రుద్ర, చంఢీ, ఆయుష్షు, మహా మృత్యుంజయ యాగం దిగ్విజయం

  • 4 రోజుల పాటు దిగ్విజయంగా జరిగిన గణపతి, రుద్ర, చంఢీ, ఆయుష్షు, మహా మృత్యుంజయ యాగం నేడు వేద పండితుల మంత్రోశ్చారణ, ఆశీర్వాదములతో ముగిసింది

రాజానగరం నియోజకవర్గం: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జన్మదినం పురస్కరించుకుని పవన్ కళ్యాణ్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, అష్ట ఐశ్వర్యములుతో, అత్యున్నత పదవులతో దిన దినాభివృద్ధి చెందాలని రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో సోమవారం నుండి గురువారం వరకు గణపతి, రుద్ర, చండీ, ఆయుష్షు, మహా మృత్యుంజయ యాగం గురువారం ఆఖరి రోజు 30 మంది వేద పండితుల మధ్య దిగ్విజయంగా ముగిసింది. అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నిరంతరం ప్రజాసేవతో ప్రజల పక్షాన అలుపెరుగని పోరాటాలు చేస్తూ ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో అన్ని విధాల దృష్టుల మరియు శత్రుబాధలు తొలగి రాజ్యాధికారం పొంది ఆంధ్ర రాష్ట్రాన్ని, ఆంధ్ర రాష్ట్ర ప్రజలను రక్షించాలని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా, సంతోషంగా, ఏ విధమైన ప్రకృతి వైపరీత్యాలు లేకుండా అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని ప్రార్థిస్తూ యాగాన్ని 30 మంది వేద పండితులతో రాజమండ్రి వారి స్వగృహం నందు 4వ రోజు ప్రారంభించిన రాజానగరం జనసేన పార్టీ ఇంచార్జ్ బత్తుల బలరామకృష్ణ యాగాన్ని దిగ్విజయంగా పూర్తిచేశారు.