జగ్గు భాయ్ & కో పోస్టర్ ను విడుదల చేసిన సిజి రాజశేఖర్

పత్తికొండ నియోజకవర్గం: పత్తికొండ జనసేన నాయకుడు సిజి రాజశేఖర్ గురువారం జగ్గు భాయ్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా సిజి రాజశేఖర్ మాట్లాడుతూ.. మన ఆంధ్ర రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు ప్రజలకోసం ఏ సమస్యలపైన ప్రశ్నించినా జగ్గు భాయ్ & కో టీమ్ ఇచ్చే సమాధానం పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిలు చేసుకున్నాడు, ప్యాకేజీ తీసుకున్నాడు, ఇవే తప్ప ఈ వైసీపీ బ్యాచ్ ని విమర్శచడానికి ఏమి లేదని పోస్టర్స్ రిలీజ్ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ నాయకులు వడ్డే విరేష్, ఇస్మాయిల్, నరేంద్ర, విక్కీ, రమేష్, హుస్సేన్, లింగ, రాము, వెంకటేష్ రామంజి మరియు తదితరులు పాల్గొన్నారు.