పండుగలా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

పోలవరం నియోజకవర్గం:  జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల సంబరాలు బుట్టాయిగూడెం మండలంలో మిన్నంటాయి. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు, మహిళలు, జన్మదినం వేడుకలను పండగలస్ నిర్వహించారు. ఈ సందర్భంగా బుట్టాయిగూడెం బస్టాండ్ వద్ద ఏర్పాటుచేసిన మండల అధ్యక్షులు తెల్లం రవి ప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది. సుమారు 50 మంది యువకులు స్వచ్చందంగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా జనసేన సీనియర్ నాయకులు కరాటం ఉమా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేకును స్థానిక నాయకులు కరాటం సాయి, గడ్డం మనుగు రవికుమార్, నియోజకవర్గ ఇన్చార్జ్ చిర్రి బాలరాజు లు కేకును కట్ చేసి అభిమానులకు అందజేసి, పవన్ కళ్యాణ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. మర్ల గూడెం స్కూల్ లో విద్యార్థులకు గొడుగులు పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.