పవనన్న పుట్టినరోజు అభిమానులకు పండగ రోజు

  • ప్రజల మధ్య సేవా కార్యక్రమాలతో పవన్ అన్న జన్మదిన వేడుకలు.. అంజూరు చక్రధర్

సత్యవేడు నియోజకవర్గం: జనసేన పార్టీ పిఏసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆదేశాల మేరకు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని, జిల్లా సంయుక్త కార్యదర్శి, తడ శీను ఆహ్వానం మేరకు శనివారం జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా కార్యదర్శి అంజూరు చక్రధర్ ముఖ్య అతిథిగా పాల్గొని సత్యవేడు నియోజకవర్గం, వరదయ్యపాలెం బస్టాండ్ కూడలిలో కేక్ కట్ చేసి, భవన నిర్మాణ కార్మికులకు అన్నదానం చేయడం జరిగింది. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లు పంపిణీ, మరియు లక్ష్మీపురం ప్రాథమిక పాఠశాలలో చిన్న పిల్లలకు విద్యాసామగ్రి, అంగన్వాడి పిల్లలకు బిస్కెట్లు, కప్పులు, వాటర్ క్యాన్ వితరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా అంజూరు చక్రధర్ మాట్లాడుతూ, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు జనసేన నాయకులకు, కార్యకర్తలకు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు పండుగ రోజు అని అన్నారు. ఈ పుట్టినరోజు వేడుకలను ప్రజలకు ఉపయోగపడే ఐదు సేవా కార్యక్రమాలను జిల్లా వ్యాప్తంగా నిర్వహించామని అన్నారు.