కొండంపల్లి గ్రామంలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు

పెనుకొండ, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు పురస్కరించుకొని పెనుకొండ నియోజకవర్గం, పెనుకొండ మండలం, కొండంపల్లి గ్రామంలో గల ఆదిత్య ఆశ్రమం యందు శ్రీ జ్ఞానంలింగేశ్వర స్వామి ఆలయంలో పవన్ కళ్యాణ్ పేరు మీద పూజలు నిర్వహించి జ్ఞానంలింగేశ్వర ఆలయం మరియు గోశాల అభివృద్ధికి జనసేన నియోజకవర్గ నాయకులు ఈడిగ కుమార్ రూ.20116/ ఇరవై వేల నూట పదహారు రూపాయలు విరాళం అందచేయడం జరిగింది. అనంతరం రాంపురం పంచాయతీ మరువపల్లి గ్రామంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల యందు మరియు అంగన్వాడి సెంటర్ లో విద్యా సామాగ్రి (అట్టలు, పెన్నులు, పెన్సిల్) పంపిణీ చేసి మిఠాయులు పంచి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు కుమార్ మండల అధ్యక్షులు మహేష్, ఉపాధ్యక్షులు మంజునాథ్ నాయకులు బంగారం, రాజేష్ ప్రధాన కార్యదర్శి, వెంకటేష్, శ్రీనివాసులు, యువ నాయకులు మల్లేష్, రమేష్, ప్రధాన కార్యదర్శి వెంకటేష్,అనిల్ కుమార్, గోవిందు, మరువపల్లి నాయకులు, నారాయణ, ప్రసాద్, బద్రి, శివ, తదితరులు పాల్గొన్నారు.