టంగుటూరులో రక్తదాన శిబిరం

కొండేపి, జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్బంగా కేంద్ర కార్యాలయం ఆదేశాల మేరకు ఉమ్మడి ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గంలోని ఆరు మండలాల అధ్యక్షులు మండల కమిటీ సభ్యులు టంగుటూరు నందు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తం ఇవ్వటం జరిగింది. సింగరాయకొండ మండలం అధ్యక్షులు ఐనబత్తిన రాజేష్ సూచనల మేరకు సింగరాయకొండ మండల కమిటీ ఉపాధ్యక్షులు సయ్యద్. చాన్బాషా, మండల కార్యదర్శి గుంటుపల్లి శ్రీనివాసరావు, అనుమలశెట్టి కిరణ్, కిచ్చింశెట్టి ప్రవీణ్ రక్తదానం చేయటం జరింగింది. నియోజకవర్గ పరిధిలో రక్తదానం చేసి కొన్ని వందల మంది ప్రాణాలకు బాసటగా నిలిచిన ప్రతిఒక్కరికి పార్టీ అధ్యక్షులు కొణిదల పవన్ కళ్యాణ్ తరుపున, సింగరాయకొండ మండల అధ్యక్షులు ఐనబత్తిన రాజేష్ తరుపున పాదాభివందనలు తెలిపారు.