సేవామూర్తులకు సత్కారంతో ముగిసిన పవన్ సేవా వారోత్సవాలు
అమలాపురం నియోజకవర్గం: జనసేన అధ్నేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా జనసేన నాయకులు డి.ఎం.ఆర్ శేఖర్ అధ్వర్యంలో జరుగుతున్న సేవా వారోత్సవాల ముగింపు రోజు మంగళవారం సేవా మూర్తులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. కోనసీమ వ్యాప్తంగా ప్రజలు దయనందన జీవితంలో వారు ఎదుర్కుంటున్న అనేక సమస్యల పట్ల స్పందించి, సమస్యల పరిష్కారం కోసం ఉచితంగా నిరంతరాయంగా సేవలను అందిస్తున్న ఎందరో సేవా ముర్తులను గుర్తించి వారిని తగురీతిలో జనసేన పార్టీ కార్యాలయంలో సన్మానించింది. ఈ సందర్భంగా డి.ఎం.ఆర్ శేఖర్ మాట్లాడుతూ జనసేన పార్టీ ప్రధాన లక్ష్యం ప్రజలకు సేవ చేయడమనీ, అలా ప్రజల కొరకు సేవ చేస్తున్న సేవా మూర్తులకు జనసేన పార్టీ ఎప్పుడూ గుర్తించి తగిన రీతిలో గౌరవిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీమన్నారాయణ, మీరా సాహెబ్, ఆకొండి పవన్, షలోమి, షేక్ జానీ, కిరణ్ కుమార్, యండూరి రాఘవ నాగేశ్వరరావు, కాకిలేటి నాయుడు, డాక్టర్ మెట్ల సూర్యనారాయణ, దేవరపల్లి శాంతి కుమార్, చిక్కాల సత్యప్రసాద్ లను సన్మానించారు. ఈ కార్యక్రమంలో డి.ఎం.ఆర్ శేఖర్ దంపతులు, మాజీ మున్సిపల్ చైర్మన్ యాళ్ళ నాగ సతీష్, మున్సిపల్ ప్రతిపక్ష నేత యేడిద శ్రీను, సర్పంచ్ ఇసుకపట్ల జయమణి రఘుబాబు, లింగోలు పండు, ఆకుల సూర్యనారాయణ మూర్తి, పడాల శ్రీదేవి నానాజీ, ఆర్.డి.యస్.ప్రసాద్, పోలిశెట్టి బాబులు, బట్టు పండు, సాకా రాంబాబు, కొపనాతి ఏసు, సాకా బాలరాజు, కరీముల్ల బాబా, పెమ్మాడి శ్రీను, డి.యస్.యన్.కుమార్, కొరసాల కేశవ రావు, గంధం శ్రీను, సత్తి చిన్నా, పోలిశెట్టి కన్నా, నల్లా వెంకటేశ్వరరావు, పాలూరి నారాయణ స్వామి, పిల్లా రవి, వర్రే శేషు, గుండుమోగుల శ్రీను, షేక్ బాబ్జీ, నిమ్మకాయల సాయి, పోలిశెట్టి మహేష్, సాదనాల మురళి, కొలిసెట్టి తాతాజి, ఆకుల నాయుడు, బండారు వెంకన్న బాబు, నల్లా బ్రహ్మాజీ, పైబోడి పండు, కంకిపాటి నాగబాబు, మానేపల్లి రాము వీర మహిళలు తిక్కా సరస్వతి, చాట్ల మంగతాయారు, వానపల్లి దేవి, గుండుమోగుల లక్ష్మి, కర్రి లక్ష్మిదుర్గ తదితరులు పాల్గొన్నారు.