రామేశ్వరంలో శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకల్లో డాక్టర్ రమేష్ బాబు

రాజోలు నియోజకవర్గం: సఖినేటిపల్లి మండలం, రామేశ్వరం గ్రామంలో కృష్ణాష్టమి సందర్భంగా పాటబల్ల వారి గ్రూపు నందు ఉపసర్పంచ్ పాటబల్ల సూరిబాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కృష్ణాష్టమి వేడుకల్లో రాజోలు నియోజకవర్గ జనసేన నాయకులు డాక్టర్ రమేష్ బాబు పాల్గొని, కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపి, ఉట్టి కొట్టిన విజేతకు బహుమతిని అందజేసారు. ఈ కార్యక్రమంలో సఖినేటిపల్లి జనసేన పార్టీ మండల అధ్యక్షులు గుబ్బల ఫణికుమార్, పాటబల్ల సూరిబాబు, కొనతం నరసింహారావు, పాటబల్ల రామకృష్ణ, పాటబల్ల శ్రీను, పాటబల్ల గోపాలం, పాటబల్ల రాజు, పాటబల్ల శ్రీను, యువకులు తదితరులు పాల్గొనడం జరిగింది.