పప్పుల రమేష్ కుటుంబ సభ్యులను పరామర్శించిన జనసేన నాయకులు
రాజోలు నియోజకవర్గం: సఖినేటిపల్లి మండలం, మోరి గ్రామంలో మాజీ ఎంపీపీ పప్పుల రమేష్ అమ్మమ్మ పోతురాజు మహాలక్ష్మి కాలం చేశారు. వారి యొక్క పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులను గురువారం రాజోలు నియోజకవర్గ జనసేన నాయకులు పరామర్శించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు డాక్టర్ రమేష్ బాబు, బొంతు రాజేశ్వరరావు, సఖినేటిపల్లి మండల అధ్యక్షులు గుబ్బల ఫణి కుమార్, ఉండపల్లి అంజి, చింతలమోరి జనసేన పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు ఓగురి మనోహర్, రాలి శీను తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-07-at-6.39.31-PM-1024x576.jpeg)